కాంగ్రెస్‌కి భారీ షాక్!

 

 

 

ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. షాకంటే ఏదో మామూలు షాక్ కాదు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టిక్కెట్ పొందిన ఒక నాయకుడు దాన్ని విసిరికొట్టి భారతీయ జనతాపార్టీలో చేరిపోయాడు. కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే అవమానం మరొకటి వుంటుందా? ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ నుంచి రమేష్ చంద్ తోమార్ అనే నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. పార్టీ టిక్కెట్ కూడా ఇచ్చేసింది. రమేష్ చంద్ తోమార్ గట్టి అభ్యర్థి కావడంతో ఈ స్థానంలో గెలవటం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కలలు కనడం ప్రారంభించింది. అయితే కలల్లో విహరిస్తున్న కాంగ్రెస్‌కి రమేష్ చంద్ షాకిచ్చాడు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌ని కాదని నరేంద్రమోడీ సమక్షంలో బీజేపీలో చేరిపోయాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగిపోయింది. దీంతో ఈ నియోజకవర్గం బీజేపీ అకౌంట్లో చేరిపోవడం ఖాయమైపోయింది. ఈ సీటు పోతే పోయింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరువు (వుందనుకుంటే) దారుణంగా పోయింది.