ముగిసిన కోర్ కమిటీ భేటి..ఉత్కంఠకు తెర

 

Congress core committee

 

 

తెలంగాణ అంశం పై చర్చించేందుకు భేటి అయిన కాంగ్రెస్ వ్యహ బృందం సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటలపాటు ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ ఆంటొనీ, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, ఆజాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముందుగానే ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కోర్ కమిటీ సభ్యులు చేరుకున్నారు.

 

కోర్ కమిటీ భేటిలో ప్రధానంగా తెలంగాణ అంశం, వచ్చే ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. కార్యాచరణ ప్రణాళిక పై కోర్ కమిటీ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ గెలుపు, ఓటములు బాలబాలపై పార్టీ నేతలు సమీక్షించారు.