పాపం చిరంజీవి

 

 

 

ప్రస్తుతం సీమాంధ్రలో ఈ బస్సు యాత్ర చేస్తూ ప్రెస్ మీట్స్ లో చిరంజీవి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే ఆయనకు వున్న రాజకీయ అపరిపక్వత స్పష్టంగా కనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ చిరంజీవి మాట్లాడుతున్న మాటలు చిరంజీవి మీద చిరాకు పెంచి, కిరణ్ కుమార్ మీద అభిమానం పెంచేలా వుంటున్నాయి. రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనం కూడా వుంటుందా అన్నట్టుగా చిరంజీవి ప్రసంగం సాగుతోందని విమర్శకులు అంటున్నారు. కాంగ్రెస్ గర్భంలో కలిసిపోయిన పిఆర్పీ పార్టీకి చెందిన ఓ కార్యకర్త అందరిముందు చిరంజీవిని ఛీకొడుతూ ‘పార్టీని అమ్ముకోవడానికి సిగ్గులేదా?’ అని అడిగేయడం, పిఆర్పీ ఐడెంటిటీ కార్డ్ ని ముక్కలు చేసేయడం బాబోయ్ దారుణం. ఇంత జరిగినా చిరంజీవి తుడిచేసుకుని బస్సు యాత్రలో పాల్గొనడం ఇంకా దారుణమని అంటున్నారు.