దీక్ష చేస్తున్న నేతలతో మాట్లాడిన చంద్రబాబు

 

 

chandrababu tdp, tdp power deeksha, chandrababu mee kosam yatra

 

 

విద్యుత్ సమస్యలపై ఓల్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్ష చేపట్టిన 26 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో తూ.గో జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీక్షలకు సంఘీభావంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు బాబు పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి నిరసన తెలపాలని సూచించారు.  మరోవైపు విద్యుత్ సమస్యలపై టీడీపీ పోరుబాట కొనసాగుతోంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 26 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నిరవధిక దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎమ్మెల్యేల దీక్షకు మద్దతు ప్రకటించారు.