తుఫాన్ హెచ్చరికలున్న పట్టించుకోలేదు: చంద్రబాబు

 chandrababu, chandrababu meekosam yatra, chandrababu yerram naidu, chandrababu yatra

 

నీలం తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో రైతులు పంటను నష్టపోయారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తుఫాన్ హెచ్చరికలున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. జిల్లాలో రెండు రోజుల విరామం అన౦తరం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర పరిస్థితిపై అవగాహన లేదని...రాష్ట్రంలో పంటలన్నీ దెబ్బతిన్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయిన లేదని ఎద్దేవా చేశారు. అంతకుముందు చంద్రబాబు పార్టీ నేతలు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి తదితర నేతలతో కలిసి ఎర్రన్నాయుడుకి నివాళులు అర్పించారు.