చెన్నై విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర..!!

 

 

 

చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో ఈ రోజు ఉదయం జరిగిన బాంబు పేలుడు పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ పేలుళ్ళలో ఒకరు మృతి చెందగా, 20మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే చెన్నై విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పని తెచ్చిన బాంబులే ఇక్కడ పేలిఉండచ్చుననే ప్రచారం జరుగుతోంది. చెన్నై నగర విధ్వంసానికి పథకం వేసేందుకు వచ్చిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంటును బుధవారం నాడే పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని పోలీసులు విచారించగా బాంబు పేలుళ్ళతో విధ్వంసానికి కుట్రపన్నినట్లు జాహీర్ హుసేన్ వెల్లడించాడని తెలుస్తోంది. చెన్నైతోబాటు పలు నగరాల్లో బాంబులు పేల్చేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని జాహీర్ చెప్పినట్టు సమాచారం. పాక్ నుంచి నేరుగా వచ్చేందుకు వీలు కాకపోవడంతో తీవ్రవాదులు శ్రీలంకలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడినుంచి సముద్రమార్గంలో చెన్నైకి వస్తున్నట్టు వెల్లడించారు.