జగన్ పార్టీకి విజయనగరంలో ఎదురుదెబ్బ
posted on Feb 13, 2013 1:42PM
జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయనగరం జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అ జిల్లాకు చెందిన సీనియర్ రాజీకీయ నాయకుడు శంబంగి చిన అప్పల నాయుడు జగన్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు చెందిన వారికి పార్టీలో ప్రాధాన్యత లేదని, వారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పార్టీని వీడారు.
శంబంగి చిన అప్పల నాయుడు దాదాపు ముప్పయ్యేళ్లు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించారు. 1985లో టిడిపి తరఫున పోటీ చేసి గెలిచారు. 1989లో అదే పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1999, 2004లలో టిడిపి తరఫునే పోటీ చేసిన ఓటమి చెందారు. ఆయన మొదటి నుండి బొబ్బిలి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ఉన్నారు. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత అందులో చేరారు.