కొత్త వెయ్యి నోటు రాకపోవచ్చు..
posted on Nov 17, 2016 4:03PM
పాత రూ.500,1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటి స్థానంలో కొత్త రెండు వేల నోట్లు వచ్చాయి. ఇక 500, 1000 నోట్లు కూడా వస్తాయని వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. అయితే 500 నోట్ల సంగతేమే కానీ.. వెయ్యి రూపాయల నోట్లు మాత్రం వచ్చే పరిస్థితులు లేనట్టే కనిపిస్తోంది. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను బట్టి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నోట్ల రద్దు అంశంపై మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన 22500 ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు.ధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికే రోజువారీ పరిమితిని రూ.4500 నుంచి రెండు వేలకు తగ్గించినట్లు జైట్లీ తెలిపారు. ఇంకా రద్దయిన వెయ్యి నోట్ల స్థానంలో ప్రస్తుతానికైతే కొత్తవి ప్రవేశపెట్టే ఆలోచన లేదని స్పష్టంచేశారు.