సాయంత్రం బాబ్లీపై అఖిలపక్ష భేటి
posted on Mar 26, 2013 11:47AM
బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. దీంతో ఈ విషయంపై అన్ని పార్టీలతో చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా పొందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సుప్రీం ఆదేశాల ప్రకారం బాబ్లీ నుంచి నీరు విడుదల చేసేందుకు స్పష్టమైన విధానాలకోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది.