కడిగి నానబెట్టుకున్న చింతపండును గుజ్జులా పిసికి, మరీ చిక్కగా, మరీ పల్చగా కాకుండా కొన్ని నీళ్ళు పోయాలి. బెల్లం నూరి వేయాలి. ఉప్పు, జీలకర్ర, వేపపూత, మిరియాల పొడి వేయాలి. ద్రాక్ష, కమలా పళ్ళ గుజ్జు, అరటిపళ్ళ ముక్కలు కలుపుకోవాలి. అంతే, ఉగాది పచ్చడి రెడీ.
కొన్ని ప్రాంతాల్లో మిరియాల పొడికి బదులు పచ్చి మిరపకాయలు, లేదా ఎండుకారం వేస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో పండ్ల ముక్కలు వేయరు. అలాగే కొందరు వేపపూత మొగ్గలతో సహా వేస్తారు. అందువల్ల ఉగాది పచ్చడిలో చాలా రుచులు ఉన్నాయి. అందుకే కార్టూనిస్టులు ఉగాది పచ్చడిపై కార్టూన్లు వేస్తున్నారు.
మనం పైన చెప్పుకున్న ఉగాది పచ్చడి మాత్రం షడ్రుచులు కలిసి, యమా రుచిగా , ఇంకా తినాలనిపించేలా ఉంటుంది.
|