చేపలు శుభ్రంచేసి ముక్కలు చేయకుండా అలాగే వుంచాలి. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క అన్నీ కలిపి ముద్దనూరాలి. పచ్చిమిర్చిపొడుగ్గా ముక్కలు కట్ చేయాలి. టొమేటో ముక్కలు చేయాలి.
ఫ్రయింగ్ ప్యాన్ లో నూనె వేడయ్యాక కరివేపాకు, మసాలా ముద్ద, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించాలి. చేపలకు ఉప్పు కారం, పసుపు పట్టించి, ఇందులో వేయాలి. బాగా కలిపి, టొమేటో ముక్కలు వేసి 5నిముషాల పాటు సన్నసెగలో మగ్గించి చేపలు మునిగేంతవరకూ నీరు పొసి గ్రేవీ తయారైన తరువాత మరీ చిక్కబడకుండా దించి, తరిగిన కొత్తిమీర చల్లితే సరిపోతుంది. |