శుక్ర మూఢమి లేదా మౌఢ్యమి

 

శుక్ర మూఢమి 09-07-2019 న శుక్ర మూఢమి ప్రారంభమై 20-09-2019 న శుక్ర మూఢమి త్యాగం జరుగును.

బుధుడు, శుక్రుడు భూకక్ష్యకు లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ బుధ శుక్రులు భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యుని యొక్క అవతలి వైపుకి వెళ్ళినప్పుడు భూమిపైన ఉన్న మనకు బుధ, శుక్రులు కనిపించారు.అట్టి సమయాన్నే బుధ అస్తంగత్వం, శుక్ర అస్తంగత్వం అంటారు. శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు శుక్ర మౌడ్యమి అంటారు.


శుక్రుడు సూర్యునికి అవతలివైపునకు వెళ్ళినప్పుడు “ప్రాక్ అస్తంగత్వం” అని,శుక్రుడు సూర్యునికి భూమికి మద్య అస్తంగత్వం అయినప్పుడు పశ్చాద అస్తంగత్వం అంటారు. మౌడ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు.అందువల్ల మౌడ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.


శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము. మౌఢ్యమిని మూఢమిగా వాడుకభాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు. మూఢమి అంటే చీకటి. శుక్రుడు సూర్య గ్రహమునకు ముందూ, వెనుక 10 డిగ్రీ ల దూరము లోపు శుక్రుడన్నట్లయితే అస్తంగత్వమునకు గురి అవును. అనగా శుక్రుడు తన తేజస్సును, ప్రభావాన్ని, శుభత్వాన్ని కోల్పోవును. అందువల్ల ఆ కాలములో చేసే శుభకార్యాలకు శుభ గ్రహమైన శుక్రబలం ఉండదు కాబట్టి శుభకార్యాలు చేయరాదు. కాబట్టి నిషేథ కాలముగా పరిగణించారు. అలాగే ముఖ్యముగా పెళ్ళిచూపులు, వివాహం, చేయరాదు, వాహన కొనుగోలు చేయరాదు.

 


శుక్ర మౌఢ్యమి ఏర్పడినప్పుడు సమస్త జీవకోటి శృంగార సంబంథమైన విషయాల్లో బలహీనత ఏర్పడుతుంది. వీర్యకణాలలో జీవత్వం, పటుత్వం ఉండదు. శుక్రమౌఢ్యమి కాలంలో ప్రసవం జరిగినప్పుడు శుక్ర గ్రహ, రవిగ్రహ శాంతి చేయాలి. శుక్రదశ మహా దశ మరియు శుక్రుని అంతర్దశ నడుస్తున్నవాళ్ళు చాలా జాగరూకులై ఉండాలి. శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు, పోటులలో మార్పులు వస్తాయి.

 

శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యథికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి – శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు. ఈ జన్మకు ఇంతేనని సరి పెట్టుకోవాలి. ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి. మూడమి అన్ని గ్రహాలకు ఉన్న గురు,శుక్ర మౌడ్యమి మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుంది. ఈ మూడమిలో జప,హోమాది శాంతులు గ్రహా శాంతికి అభిషేకాలు గండనక్షత్ర శాంతులు అన్ని వ్రతాలు చేయవచ్చును. 


More Aacharalu