"గండకీ శిల - సాలిగ్రామం"

"ద్వారకా శిల - చక్రాంకితాలు" - రెండూ విష్ణు స్వరూపాలే!

 

 


                   సాలిగ్రామం అంటే శిలరూపంలోవున్న విష్ణు మూర్తి అవతారం! అవి ఎక్కడ పడితే అక్కడ లభ్యం కావు . హిమాలయాలలో, నదీ ప్రవాహం లో చాలా కొద్ది చోట్ల మాత్రమే లభిస్తాయి . అందులోనూ చాలా రకాలున్నాయి. నేపాల్ లోని గండకీ నదిలో లభించే ఈసాలిగ్రాములు ఎంతో పవిత్రమైనవి. సహజంగా రాతిలోనే చక్రాలుగా, అనేక చిన్న చిన్న రంద్రాలుగా, ఇంకా అనేక గుర్తులతో ఏర్పడుతుంటాయి . వీటిని పూజా మందిరంలో దేవతార్చన డబ్బాలో పెట్టి రోజూ మడితో పూజ చేస్తారు.  పురుషసూక్తం చదువుతూ సకలషోడశపచారాలతో పూజ చేస్తారు. మహా నైవేద్యం సమర్పిస్తారు. ఇది అందరూ కూదా చేయలేరు. స్త్రీలు అసలు చేయరు... తాకరు . కుటుంబ సభ్యులు మాత్రమే వాటిని  పూజించే అర్హత  వుంటుంది. బయటి వారికి చూపించరు.

 


సాలిగ్రాము - తులసి


పూజా సమయంలో  తప్పనిసరిగా  సాలిగ్రాములతో పాటు  తులసి దళాలను  కూడా పక్కన  వుంచి  పూజ  చేస్తారు. సాలిగ్రాముకి  తులసికి  కార్తీక  మాసం లో వివాహం చేస్తారు.  తులసి సాలిగ్రము  అంటే  విష్ణుమూర్తి ని  ప్రేమించి  వివాహం  చేసుకుంది.  ఈ  కథ  అందరికి  తెలిసిందే .   నార్త్  లో  సాలిగ్రామ శిలకి తులసి  ప్రతిమకి  వైభవం గా వివాహం  చేస్తారు . ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయాలలో  కూడా  తులసికి శ్రీకృష్ణుడికి కల్యాణం  చేస్తారు ..  


సాలగ్రామం అంటే  విష్ణుమూర్తి అని భావించి   పంచ గవ్యం,  పంచామృతాలతో  అభిషేకించి,  పూలు, పళ్ళు,  ధూప దీప  నైవేద్యాలతో  అర్చించాలి.  అనంతరం  తీర్థ ప్రసాదాలు  స్వీకరిస్తే సర్వ శుభాలు  కలుగుతాయి.   తులసి  పురాణ  కధలే  కాదు  ఇంకా అనేక  కథలు  ప్రాచుర్యం లో వున్నాయి.  కాలనేమి  పుత్రిక  బృంద జలంధరుడిని  వివాహం  చెసుకుంటుంది. కాని జలంధరుడు తన రాక్షస  స్వభావంతో  అందరినీ హింసిస్తుం టాడు.  బృంద  ప్రాతివత్య మహిమతో  అతనిని  ఏమి  చేయలేక పోతారు బ్రహ్మాది  దెవతలు.  బృందకి  ప్రాతివ్రత్యానికి భంగం  వాటిల్లితే  తప్ప  జలధరుని సంహరించ లేరని  తెలిసి,   శరణు వెడు తారు.  విష్ణుమూర్తి  లోక సంరక్షణార్థం  జలంధరుని  రూపం  ధరించి  బృందని  మోసగిస్తాడు .విష్ణువు  నిజ స్వరూపం  తెలిసిన  బృంద శిలగా మారమని  శపిస్తుంది. ఈ విధంగా  విష్ణుమూర్తి  శిలగా  మారాడని ఒక కధనం వుంది .  
మహాభారతం లో కూడా శ్రీకృష్ణుడు సాలిగ్రామ  లక్షణాలను  ధర్మరాజు కి  వివరించినట్లు వుంది.

 


మన దేశంలోనూ  ఇతర  దేశాల్లోనూ  ఉన్న  దేవాలయాలలో  సాలిగ్రాములని పూజిస్తారు. మనకి లభించే  సాలిగ్రమాల్లో  కూడా కొన్ని ఎంతో  పవిత్రమైనవి.  సాలిగ్రామాలని  పూజించటం ద్వారా  ఉజ్వల  భవిష్యత్తుని, సంతానాన్ని, సంపదలని, , శాంతిని, ఇలా ఎన్నో  లభిస్తాయనీ అంటారు.  
వైష్ణవులు అతి పవిత్రంగా సాలిగ్రామలనుపూజిస్తారు.   కొన్ని నియమాలు  పాటిస్తారు .
స్నానం చేయనిదే  సాలిగ్రామాన్ని  తాకరు.  నేలమీద  వుంచరు. సాత్వికమైన  ఆహారాన్ని  తీసుకుంటారు. చెడు  పనులు చేయరు.
                  నేపాల్ లోని కాళీ -  గండకి నదీ ప్రవాహంలో  లభించే సాలిగ్రామాల్లో విష్ణుమూర్తి అవతారాలు  సహజ  సిద్ధంగా  శిలా రూపం లో లభిస్తాయి. శంఖ, చక్ర, గద,రూపాలు శిలపై వున్న  చక్రాలను ,  వాటి  ఆకారాలను  బట్టి  వివిధ  నామాలున్నాయి.   ఒకే  చక్రం  వుంటే  సుదర్శన  చక్రం అని అంటారు. లక్ష్మ, నరసింహ  కూర్మావతారాలలో  కూడా  సాలిగ్రాములు  లభిస్తాయి.
సాలిగ్రామాలలో  వారి రంగు, చక్రాల  గీతాలు ,  సైజ్ ను బట్టి  అది ఎలాటి  సాలిగ్రామమో నిర్ణయిస్తారు. 25 రకాల  సాలిగ్రమలున్నాయి. వీటిల్లో  కొన్ని

 

 

రెండు చక్రాలు - లక్ష్మీనారాయణ ,

మూడు చక్రాలు - అచ్యుతుడు

నాలుగు చక్రాలు - జనార్ధుడు

ఐదు చక్రాలు - వాసుదేవుడు

ఆరు చక్రాలు - ప్రద్యుమ్నుడు

ఏడు చక్రాలు - సంకర్షణుడు  

ఎనిమిది చక్రాలు - పురుషోత్తముడు  

తొమ్మిది చక్రలు - నవవ్యూహం

పది చక్రాలు  - దశావతారం

పదకొండు చక్రాలు - అనిరుద్ధుడు

పన్నెండు చక్రాలు - ద్వాదశాత్ముడు  

పన్నెండు కంటే ఎక్కువ చక్రాలు ఉంటే అనంతమూర్తి అని అంటారు.

 

 

 
శిలారూపం లో లభించే సాలిగ్రాములు  కొన్ని జలాశయాలలోనూ , కొన్ని పర్వత ప్రాంతాలలోనూ లభిస్తాయి .  అవే జలజ, స్థలజ అని అంటారని వరాహ పురాణంలో  వుంది .
దేవాలయాలలోనే  కాదు  ఈ  సాలిగ్రామాల  అర్చన  గృహాలలోనూ , గృహ ప్రవేశాల సమయంలో, వాస్తు పూజా సమయంలో, .  వివాహాల సమయంలో ,చెస్తారు
అలాగే  హిమాలయాలలోని  బద్రీనాథ్ ఆలయంలోని  నారాయణుడు కూడా  సాలిగ్రమమే అని అంటారు . ఆది  శంకరాచార్యుల వారికి  అలకా నదీ ప్రవాహం లో  బదిరీ నారాయణుడి విగ్రహం  లభించిందని ,  దానిని  వారు బదిరీ లో ప్రతిష్టిం చారని  అక్కడి  స్థల పురాణం  చెబుతోంది.   ఉడిపి లోని  శ్రీ కృష్ణుడు కూడా సాలిగ్రామ రూపధారి .

 

 


ద్వారావతి శిల - ద్వారకా శిల
నల్లని గుండ్రని రాతిలో విష్ణు స్వరూపం నదీ ప్రవాహాల్లో లభిస్తే.... తెల్లని రాతిలో గుండ్రంగా చక్రాలు రాతిమీద చిన్నచిన్నవిగా లభిస్తాయ.   చక్రాంకితాలు అని పిలుస్తారు వీటిని. ఇవి ఎక్కువగా గోమతి నదిలో దొరుకుతాయి.ద్వారకా నగర నదీ తీరం  గోమతి నది.  ఇక్కడ శిలా రూపంలో  చక్రాంకితాలు లభిస్తాయి.  ఇవి  తెల్లగా వుండి చక్రాలు చక్రాలు గా వుంటాయి .  ఇక్కడ దొరికే  శిలల పై  ఒక చక్రం వుంటే దేవేసుడని, రెండు  వుంటే  సుదర్సనుడని అంటారు.  ప్రహల్లాద సంహిత లో ఒక చక్రం  వుంటే సుదర్శనమని, రెండు చక్రాలు వుంటే  లక్ష్మి నారాయణులని వుంది.  తెల్లటి శిల లపై  లభించే చక్రాల సంఖ్యను బట్టి  విష్ణుమూర్తి అవతారాలు గా  పిలుస్తారు. ఒక్కో చక్రం ఒక్కో  ఫలితాన్ని స్తుంది.   
సాలిగ్రాముల గురించి స్కంద పురాణం, బ్రహ్మపురాణం, వరాహ పురాణం, గరుడ పురాణం ఇలా ఎన్నో పురాణాలలో సాలిగ్రాముల ప్రస్తావన వుంది.  
ద్వారకా శిలలు  సాలిగ్రాముల లాగా  అంత  ప్రాముఖ్యత  లేదు.  చిన్నవిగా,  పలుచగా వుండి తెల్లటి  రాతి మీద  చక్రాలు  వుంటాయి.  చక్రాల  సంఖ్యను బట్టి  వాటికి  వివిధ  నామాలు వున్నాయి.
 గండకి  శిలలు  వివిధ  రకాల  సైజులలో వుండి వాటిపై  రక రకాల  గుర్తులు  సహజ సిద్ధంగా వుంటాయి.  వాటిపై  గుర్తులను బట్టి  సాలిగ్రామ విష్ణుమూర్తి  అవతారాలు, మనం చెప్పే  విష్ణు నామాలుగా వర్ణిస్తారు . అవే అచ్యుత, నారాయణ, జనార్ధన, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ,  వాసుదేవ  ఇత్యాది నామాలు సాలిగ్రామాలకి  వున్నాయి .

 


ఆరాధన :
సౌరాష్ట్ర, మహారాష్ట్ర, బెంగాల్ మొదలైన  రాష్ట్రాలతో  పాటు  'మధ్వ' శాఖ  బ్రాహ్మాణులు, ఇతర  శాఖ వారు ఎక్కువగా  సాలిగ్రాములను పూజిస్తారు .
 ఇవి వున్న ఇంట ఎంతో నిష్టగా పూజా పునస్కారాలు చేయాలి. రోజూ నిత్య నైవేద్యం పెట్టాలి . దేవతార్చన డబ్బా పులిచర్మం తో తయారు చేసినది కాని, వెదురు బుట్టలో (చిన్నవి) కాని పెట్టి తులసీ దళాలతో పూజిస్తారు . చాలా చోట్ల అసలు సాలిగ్రాము లంటూ నకిలీవి కూదా వుంటాయి . జాగ్రత్త గా చూసి కొనుక్కోవాలి . అంతే కాదు అవి దేవతార్చన సమయం లో తప్ప వాటిని ఇతర విగ్రహాల లాగా బయట వుంచ

 ఇప్పటి కాలంలో పూర్వకాలపు మడి ఆచారాలు తగ్గిపోవటంతో చాలా మంది సాలిగ్రామ పూజ నిష్ఠగా చేయలేక వాటిని ఇంట్లో పెట్టుకోవటం లేదు..

సాలగ్రమాల్లో రూ.200 నుంచి రూ.1,00,000 వరకు  లభిస్తాయి.  పూజ మందిరాలలో  చిన్న చిన్న  సలిగ్రమాలకే  పూజ  చేస్తారు. అభిషేకాలతో పూజ చేసిన అనంతరం  కొన్ని చోట్ల  వీటికి  అలంకారం  చేస్తారు.  కళ్ళు, ముక్కు, చెవులు, వస్త్రాలు, ఆభరణాలు   వంటివి  అలంకరించి  పూజచేస్తారు

 

 

 

 

....Mani Kopalle


More Temples