కార్తీక మహా పురాణం

ఐదవ రోజు

యమదూతల ప్రశ్నలకు విష్ణుదూతలు చిరునవ్వు నవ్వి, ''ఓ మయదూతలారా! మేం విష్ణుదూతలం. మీ ప్రభువు మీకు విచించిన ధర్మాలేమిటి? ఎవరు పాపాత్ములు, ఎవరు పుణ్యాత్ములు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులంగా చెప్పండి'' అన్నారు.

అందుకు యమదూతలు ''సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యళు దశదిశా కాలాలనూ మనుషులు చేసే పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేం శిక్షిస్తాం. ఓ విష్ణు దూతలారా! శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్చాచారులూ, సాధుజన బహిష్క్రుతులూ యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడూ, అసత్యవాది, జంతుహింస చేసేవాడు, దానం చేసినదాన్ని తిరిగి ఆశించేవాడూ, దాంబికుడు, దయారహితుడూ, పర భార్యా సంగముడు, పక్షపాత వైఖరి చూపేవాడు, చేసిన దానాన్ని చెప్పుకునేవాడు, మిత్ర ద్రోహి, కృతఘ్నుడు, తోటివారిని చూసి ఏడ్చేవాడూ, కన్యాశుల్కంతో జీవించేవాడూ, వాపీకూప తటాకాది నిర్మాణాలను ఆటంకపరిచేవాడు, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచినవాడు, కేవలం భోజనం గురించి ఆలోచించేవాడూ, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవాడూ, నిత్యం స్నాన సంధ్యాడులను విడిచినవాడు, బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మాచేత దండించబడతారు.


More Festivals