కవికి మరణం ఉండదు
జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః ।
నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయమ్ ॥
సద్గ్రంథాలను రాసిన కవీశ్వరులు, చిరకాలం ఈ లోకంలో నిలిచిపోతారు. శరీరానికి అతీతమైన కీర్తితో వారు మృత్యువుని జయిస్తారు. యోగులు ఎలాగైతే జరామరణాలకు అతీతంగా ఉంటారో... కవీంద్రులు సైతం తమ గ్రంథాల ద్వారా అలాగే చిరస్థాయిగా మిగిలిపోతారు.