కార్తీక మహా పురాణం ఎనిమిదవ రోజు

  Karthika Puranam – 8

 

వశిష్ట ఉవాచ

''జనక నరేంద్రా! కార్తీకమాసంలో ఎవరైతే శ్రీహరి ముందు నాట్యం చేస్తారో, వాళ్ళు హరిని ప్రసన్నం చేసుకున్నవారౌతారు. కార్తీక ద్వాదశినాడు హరికి దీపమాలార్పణ చేసేవారు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలం విష్ణువును అర్చించేవాళ్ళు స్వర్గ నాయకులౌతారు. ఈ నెలరోజులూ నియమంగా విష్ణు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకూ ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీకమాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళనివారు ఖచ్చితంగా రౌరవ నరకానికో, కాలసూత్ర నరకానికో వెళ్తారు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు చేసే ప్రతి సత్కర్మా అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మా అక్షయ పాపాన్ని కలిగిస్తాయి. శుక్ల ద్వాదశినాడు విప్ర సహితుడై భక్తియుతుడై గాంధ పుష్పాక్షతలు, దీపదూపాజ్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించేవారి పుణ్యానికి మితి అనేది లేదు.

కార్తీక శుద్ధ ద్వాదశినాడు శివాలయంలో గానీ, కేశవాలయంలో గానీ లక్ష దీపాలను వెలిగించి, సమర్పించేవాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడ్తలు అందుకుంటూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకం నెలంతా దీపం పెట్టలేని వాళ్ళు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ -రోజుల్లో దీపం వెలిగించాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా దైవ సన్నిధిలో దీపం వెలిగించినవాళ్ళు పున్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసినవాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే, దాన్ని పునః వెలిగించేవారు ఘనమైన పాపాల నుండి విముక్తి పొందుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను, విను. 

ఎలుక దివ్య పురుషుడైన విధం

సరస్వతీ నదీతీరంలో అనాదిగా పూజా పునస్కారాలు లేక శిథిలమై పోయిన విష్ణు ఆలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానార్ధమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి, తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి, ఆ గుడిని తుడిచాడు. నీళ్ళు చల్లాడు. దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్ళి పత్తి, నూనె, పన్నెండు ప్రమిదలు తెచ్చి, దీపాలను వెలిగించి ''నారాయనార్పణమస్తు'' అనుకుని తనలో తాను ధ్యానం చేసుకోసాగాడు.

యతి ప్రతిరోజూ ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశినాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరక్కపోవడంవల్ల ఆకలితో ఉన్న ఒక ఎలుక ఆ గుడిలో ప్రవేశించింది. ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణ చేసి మెల్లగా దీపాల దగ్గరికి వచ్చింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వల్ల ఆరిపోయిన వత్తి మాత్రమే ఉండి. తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక, అదేదో ఆహారంగా భావించి, ఆ వత్తిని నోట కరచుకుని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. అప్పటిదాకా నూనెలో మునిగి, వెలిగిన వత్తి కావడంతో ఆ వేడికి వెలుగుతున్న వత్తి తగిలి వెంటనే అంటుకుంది. చప్పున ఎలుక వత్తిని నోటినుండి జారవిడవడంతో అది కాస్తా ప్రమిదలో పడి, రెండు వత్తులూ వెలగసాగాయి.

రాజా! కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా, ఆ దీపం ఎలుకవల్ల పునః ప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవశాన ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే విగత దేహియై దివ్యమైన పురుష జన్మను పొందింది.

అప్పుడే ధ్యానం నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుని చూసి, ''నువ్వెవరు? ఇక్కడికి ఎందుకొచ్చావు?'' అనడిగాడు.

ఆ అద్భుత పురుషుడు ''ఓ యతీంద్రా!నేనొక ఎలుకను. కేవలం గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అలాంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వల్ల వచ్చిందో తెలీడంలేదు. పూర్వజన్మలో నేనెవర్ని? ఏ పాపం వల్ల అలా ఎలుకనయ్యాను? ఏ పుణ్యం వల్ల ఈ దివ్య దేహం పొందాను? తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి. దయగలవాదివై వివరించు. నేను నీ శిష్యుణ్ణి'' అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాన నేత్రంతో సర్వం దర్శించి ఇలా చెప్పాడు.

తిలాసమేతంగా నేతితో దీపాన్ని వెలిగించి, విష్ణు అర్పణం చేసి, మళ్ళీ గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి ఛటచ్చటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపం వైపు చూశారు. వాళ్ళు అలా చూస్తుండగానే ఆ స్థంభం ఫటఫటమంటూ నిలువునా పగిలిపోయింది. అందులో నుండి ఒక పురుషాకారుడు వెలువడటంతో విస్మయచకితులైన ఆ ఋషులు ''ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు" నే కథ ఏమిటో చెప్పు'' అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు.

''ఓ మునివరేణ్యులారా! నేను గతంలో ఒక బ్రాహ్మణుడను. అయినా వేదశాస్త్ర పఠనం గానీ, హరి కథా శ్రవణం గానీ క్షేత్ర యాత్రాటనలు గానీ చేయలేదు. అపరిమిత ఐశ్వర్యంవల్ల బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజుని పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములూ అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చోబెట్టి, నేను ఉన్నతాసనంపై కూర్చునేవాణ్ణి. ఎవరికీ దానధర్మాలు చేసేవాణ్ణి కాను. తప్పనిసరి అయినప్పుడు మాత్రం ''ఇంతిస్తాను, అంతిస్తాను'' అని వాగ్దానం చేసేవాణ్ణే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాణ్ణి కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికి ఖర్చు చేసుకునేవాణ్ణి. ఫలితంగా దేహాంతాన నరకగతుడనై, అనంతరం 52 వేలసార్లు కుక్కగా, పదివేలసార్లు కాకిగా, ఇంకో పదివేలసార్లు తొండగా, మరో పదివేలసార్లు పురుగుగా, కోటి జన్మలు చెట్టుగా, గత కోటి జన్మలుగా ఇలా మొద్దువలె పరిణమించి కాలం గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి.

ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు.

''ఈ కార్తీక వ్రతఫలం యదార్ధమైంది. ఇది ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళముందే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా! అందునా కార్తీక పూర్ణిమనాడు స్తంభదీపాన్ని పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనం పెట్టిన దీపంవల్ల ఈ మొద్దు ముక్తిని పొందింది. మోద్దయినా, మాను అయినా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వల్ల దామోదరుని దయవల్ల మోక్షం పొందడం తథ్యం''

ఇలా చెప్పుకుంటున్నవారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు ''అయ్యలారా! దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడూ, దేనిచేత బుద్ధుడూ అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించండి'' అని ప్రార్ధించడంతో, ఆ తాపసులలో ఉన్న అంగీరసుడు అనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు.

Kartika Puranam book, Kartika Puranam in 30 Parts, Hindu Epic Kartika Puranam, Kartika Puranam Vashishta


More Festivals