పెట్రోలు విరాళాలు


  పెట్రోలు విరాళాలు

 

ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది...వందలాది కార్లు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాయ్. అందులో వినయ్ కారు ఒకటి. వాచ్ వంక విసుగ్గా చూసుకుంటున్న వినయ్ కారు విండో అద్దం మీద ఒక వ్యక్తి కంగారుగా దబదబా బాదుతున్నాడు. వినయ్ విండో డోర్ కిందకి దించాడు.


'' ఏంటి? అడిగాడు వినయ్.


''సార్..టెర్రరిస్టులు ఇప్పుడే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్, చిదంబరం, షిండే, సుష్మాస్వరాజ్....వీళ్ళ౦దర్ని కిడ్నాప్ చేశారు సార్... వాళ్ళందర్ని విడిచిపెట్టడానికి వాళ్ళు 1000 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అడిగిన మొత్తం ఇవ్వకపోతే అందరి మీద పెట్రోల్ పోసి తగల బెడ్తామని అంటున్నారు సార్..అందుకే మేము ఇక్కడున్న అందర్ని విరాళాలు ఇవ్వమని అడుగుతున్నాం...'' అన్నాడు ఆ వ్యక్తి.


'' అంటే మేము ఇప్పుడు ఎంతెంత విరాళం ఇవ్వాలని నీ ఉద్దేశం? " అడిగాడు వినయ్.
''ఎంతో కాదు సార్..మీరంతా చెరో లీటర్  పెట్రోలు ఇస్తే చాలు''