|
shivapuraanaam | shiva | puraanaam | brama | telugu |vishunu |jyothi |pujalu | ewshwara
సృష్టికి శ్రీకారం |
ఈ చర్యతో ఒక్కసారి ఉలిక్కిపడతాడు బ్రహ్మ. అప్పటివరకూ తనను ఆవరించి ఉన్న మాయపొర, అహంకారం, అజ్ఞానమూ ఈశ్వరుని చర్యతో మటుమాయమైపోతాయి. ఇప్పటికి తనేమిటో తన ఆవిర్భావ పరమార్థం ఏమిటో, తాను ఎక్కడినుంచి జన్మించాడో, తన జన్మకు కారకుడు ఎవరో ... అన్న విషయాలన్నీ అవగతమవుతాయి. అంతే! ఇంక ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా పరమేశ్వరుని పాదాలపై పడి ‘’క్షమించమ’’ణి వేడుకుంటాడు.బ్రహ్మదేవుని ప్రార్థనతో శాంతించిన శివుడు తన రౌద్రాకారాన్ని ఉపసంహరించుకుని స్సస్వరూపాన్ని ధరించి శాంతస్వరంతో ఇలా అంటాడు |
|
‘’ఓయీ బ్రహ్మ! సర్వజ్ఞాన సంపన్నుడు, వేదనిలయుడు, ముఖ్యంగా నీ జన్మకు కారకుడూ అయిన విష్ణువు వద్దనుంచి వేదాలసారాన్ని గ్రహించి సృష్టి కార్యాన్ని మొదలుపెట్టు’’ అని చెబుతాడు ఇంకా ---
‘’ఆ సృష్టిని ఒక క్రమమైన విధానంతో పెంచి పోషించే బాధ్యతను విష్ణుమూర్తి నిర్వహిస్తాడు. ఆ సృష్టిని కాలానుగుణ౦గా సమయం తీరిపోగానే రుద్రునిగా లయం చేసే ప్రక్రియను నేను స్వీకరించి నిర్వహిస్తాను. ఇది ఇలా నిరంతరం ఆగకుండా సాగాల్సిన ప్రక్రియ. ఇకనుంచి ఆయా కార్యాలను నిర్వహించే మనం బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా కొనియాడబడతాము. సృష్టి, స్థితి, లయ కార్యాలను నిర్వహించే మన ముగ్గురం త్రిమూర్తులుగా విఖ్యాతి చెందుతాం. అయితే త్రిమూర్తులుగా వేర్వేరు రూపాలతో మనం కనిపిస్తున్నప్పటికీ నిజానికి మన ముగ్గురమూ ఒక్కటే, మనలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే బేధాలు ఉండవు. నన్ను శివుడని, మహేశ్వరుడని, శంకరుడని వేర్వేరు నామాలతో పిలుస్తూ కొలుస్తారు. నా ఈ జ్యోతిర్లింగాన్ని శ్రద్ధతో పూజించిన వారికి సర్వసుఖాలూ అబ్బుతాయి. ఏ విధమైన శంకాటంకాలు లేకుండా జీవితం సజావుగా సాగిపోతుంది. అత్యంలో వారు నా సన్నిధికి చేరుకుంటారు’’ అని బ్రహ్మ విష్ణువులకు వివరించి ఆ మహాజ్యోతిర్లింగంలో కలిసి అదృశ్యమావుతాడు మహేశ్వరుడు.
ఈశ్వరుడు చెప్పిన విషయాలన్నీ ఆకళింపు చేసుకుంటారు బ్రహ్మవిష్ణువులు. శివుడు అంతర్థానం కాగానే ఆ జ్యోతిర్లింగానికి అనేక విధాలుగా పూజలు నిర్వహిస్తారు వీరు. మహాన్యాసపూర్వక రుద్రాధ్యాయాలతో మహాలింగాన్ని అభిషేకించి మహోన్నతంగా అర్చనలు, హారతులు సమర్పిస్తారు.
చేపట్టే సృష్టికార్యాన్ని సజావుగా నడిపించే శక్తిని చాలినంతగా ఇమ్మని పరిపరివిధాలుగా ప్రార్థిస్తారు. ఆ అర్చనలకూ, అభిషేకాలకూ, అర్థింపులకూ శివుడు పొంగిపోతాడు. అంతేకాదు! వెంటనే వీరి ముందు ప్రత్యక్షమై ‘’మీరు నిరాటంకంగా మీమీ కార్యాలని పూర్తిచేయగలరు. నిస్సంకోచంగా కార్యసాధకులు కండి’’ అని ఆశీర్వదించి అంతర్హితుడవుతాడు.
శివాజ్ఞతో బ్రహ్మవిష్ణువులిద్దరూ సృష్టి ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు ఆయత్తమవుతారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా జలం తప్ప మరేమీ కనిపించడం లేదు కదా, సృష్టిని ఎలా, ఎక్కడినుంచి మొదలుపెట్టాలంటూ వీరిద్దరూ ఒకరినొకరు సంప్రదించుకుంటారు. ఇంతకంటే ముందు బ్రహ్మ విష్ణువు ద్వారా వేదాలనన్నింటినీ ఆకళింపు చేసుకుని సర్వజ్ఞాన సంపన్నుడవుతాడు. అనంతరం బ్రహ్మదేవుడు సృష్టికార్యానికి పూనుకుంటాడు. |
ఇంకా ఉంది..... |
|
|
|
|