సృష్టి కార్యం సజావుగా సాగేందుకోసం ఇలా వైవిధ్యభరితమైన రూపాలు ధరించామంతే అంటాడు పరమేశ్వరుడు. ఈ విధముగా ఒకరినొకరు మన్నించుకుంటు ఒకరి వద్ద ఒకరు సెలవు తీసుకుని ఎవరి లోకంలో వారు హాయిగా గడుపుతుంటారు. జగదారాధకులైన పార్వతిపరమేశ్వరులు కూడా కైలాసంలో ప్రణయసల్లాపాలతో ఉంటారు. వీరిని కోలుచుకుంటు మిగిలిన దేవగణమంతా వారివారి పనుల్లో నిమగ్నమై ఉంటారు. సకల లోకాలకు అధిపతిగా అందరితోను పూజలందుకుంటు పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ౦టాడు. ఉత్తరాధిపతి అయిన కుబేరునికి పరమేశ్వరుడ౦టే మహాఇష్టం. ఆయనకు ఎంతో సాన్నిహిత్యంగా కొలుస్తూ పరవశించి పోతుంటాడు కుబేరుడు.”అని నందీశ్వరుడు మార్కండేయునికి శివపురాణంలోని, సృష్టిక్రమం అనే రసవద్ఘట్టాన్ని వినిపిస్తాడు”అని సూతమహర్షి
ఇక్కడ శౌనకాది మహర్షులకు సవివరంగా చెబుతాడు.
తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎప్పుడైతే మనస్సులో కలిగిందో అప్పుడే కొత్తకొత్త విషయాలు
వెలుగులోకి వస్తాయి. అయితే మనస్సులో కలిగిన ఈ జిజ్ఞాస గ్రహించి తగు విధంగా విషయాలను వివరించే గొప్ప ప్రజ్ఞావంతుడు అందుకు అవసరమవుతారు.
అప్పుడే విషయ వివరణ రసవత్తరంగా సాగుతుంది. ఆ ప్రాజ్ఞాపాటవానికి సూతుడు
నిలువెత్తు నిదర్శనం అయితే ఈ జిజ్ఞాసకు శౌనకాది మహర్షులంతా ప్రతీకలుగా నిలుస్తారు.
కుబేరుడు పరమశివునికి అంత సన్నిహితంగా ఉండటానికి కారణం ఏమిటో తెలుసుకోవాలన్న ఆకాంక్ష, ఆత్రుత శౌనకాదిల్లో కలుగుతుంది . ఇదే విషయాన్ని
వారు సవినయంగా సూతుడిని అడిగి అందుకు కారణమేమిటో వివరించమంటారు. చెప్పేవారు ఎంత గొప్పవారైనా అయన వద్ద నుంచి మహోన్నతమైన విషయజ్ఞానాన్ని రాబట్టగలిగే సమర్ధుడైన ప్రశ్నించేవాడు అవసరమే అని దిన్నిబట్టి
మనకు అర్ధం అవుతుంది.శౌనకాది మహర్షుల్లో కలిగిన సందేహాన్నితీర్చే౦దుకు సూతుడు ఉపక్రమిస్తాడు అందరు ఎంతో శ్రద్దగా వినడానికి సంసిద్ధులై ఉన్నారు. |