|
Shivapuraanaam | puraanaam | shiva | brama | parvathi | parameshwara | lakshmi | lakshminarayana | vani | keerthi | eshwarudu | dhrama.
కాలనిర్ణయం |
ఎనిమిది దిక్కులకు ఎనిమిదిమందిని. అధిపతులుగా నియమిస్తారు .తూర్పుదిక్కునకు ఇంద్రుడు, పడమర – వరుణుడు, దక్షిణానికి యముడు,
ఉత్తర – కుబేరుడు అధిపతులు కాగా, ఇక ఈశాన్యానికి ఈశ్వరుడే అధిపతిగా ఉంటాడు.అలాగే అగ్నేయానికి అగ్నిదేవుడు, వాయువ్యానికి వాయువు,
నైరుతికి నిరుతి అధిపతులుగా ఉంటారు.ఇలా అష్టదిక్కుల్ని,వాటికి అధిపతుల్నికూడా త్రిమూర్తులు నిర్ణయిస్తారు.
అనంతరం కాలాన్నికూడా నిర్ణయిస్తారు.కలా, కాష్ట, ముహూర్తాలు, రోజులు, వారాలు, పక్షాలు,నెలలు, సంవత్సరాలు, యుగాలు తదితర కాలమానం సృజించబడుతుంది. |
|
మేషాదిరాశులు, గ్రహాలు కూడా ఏర్పడతాయి.దీంతో ఈ నవగ్రహాలు ద్వాదశ రాశులలోనూ సంచారం సాగించడంతోనే ప్రాణకోటికి శుభాశుభ ఫలితాలు ఉండేలా ఏర్పాటు చేశారు .అలాగే పుణ్యకార్యాలకింద యజ్ఞయాగాదులను రూపొందిస్తారు. ఇలా యాగాలు చేసే సమయంలో హవిర్భావాన్ని యజ్ఞపురుషుడైన నారాయణుడికి అందించేందుకు అగ్నిదేవుడిని
నియమిస్తారు. ఈ విధంగా లోకమంతా సక్రమ౦గానూ, ధర్మబద్ధంగానూ, సత్యసమ్మతంగాను వ్యవహరి౦ప బడేలా విధివిధానాలను ఏర్పాటు చేస్తారు.
ఈ వ్యవహారంమంతా సజావుగా సాగేందుకు బ్రహ్మదేవునికి ఒకవైపు ఈశ్వరుడు, మరోవైపు శ్రీ మన్నారాయణుడు అన్ని విధాలా సహకరిస్తారు. అనంతరం లక్ష్మీనారాయణులు, వాణిబ్రహ్మలు ఇద్దరు జంటలు ఆ పార్వతిపరమేశ్వరుల్ని
వేనోళ్ళ కీర్తిస్తారు. |
ఇంకా ఉంది..... |
|
|
|
|